ప్రయాణికులకు బిగ్ అలర్ట్..త్వరలో రోడ్డుపైకి RTC EV ఆటోలు.. Telangana RTC launch electrical auto services in Hyderabad latest news
Telangana RTC launch electrical auto services in Hyderabad latest news : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఆటో అందుబాటులో రానున్నాయి. అందుకు గాను EV ఆటో తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో ప్రయాణికులు ఆర్టీసీ కనెక్టివిటీ పెరగడంతో ప్రయాణికులు సమయం కూడా ఆదా అవుతుంది.

ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో ఆర్టీసీ ద్వారానే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ” పేరుతో EV ఎలక్ట్రికల్ ఆటో తీసుకురానన్నారు. ప్రయాణికులు బస్సు తో పాటు ఆటో సేవలు కూడా అందించనున్నారు. ప్రయాణికులు బస్సు టికెట్ తో పాటు ఆటో టికెట్ ఒకేసారి బుక్ చేసుకుని అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణికులు బస్టాండు దిగిన తర్వాత వెళ్లవలసిన చోటికి ఆటో తీసుకొని వెళ్లవలసి వస్తుంది. మొదట గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లో ఆ తర్వాత వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాలలో అందుబాటులో రానున్నాయి ప్రస్తుతం EV సంస్థతో ఆర్టీసీ చర్చలు జరుపుతున్నారు.
బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు అతి సౌకర్యంగా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుడు ఉన్న ప్రాంతం నుంచి సమీపంలో బస్ స్టాప్ వరకు ఈ ఆటోలు తీసుకురానన్నారు. ప్రస్తుతం ఓలా, రాపిడో & ఉబెర్ వంటి సంస్థల ఆటో చార్జెస్ పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటో చార్జెస్ తక్కువ ఉండేలా చర్యలు తీసుకోమన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులకు కనెక్టివిటీ పెరగడంతో ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవుతుంది.


