AP 10th Class Results 2025 : టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
Andhra Pradesh 10th Class results 2025 Latest News : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు సజావుగా పూర్తయ్యాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన ఈ పరీక్షలు, ఇవాళ (మార్చి 26) సోషల్ స్టడీస్ పరీక్షతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకోగా, 6.17 లక్షల మంది హాజరయ్యారు.
10th క్లాస్ పరీక్షల అనంతరం, విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3న ప్రారంభం కానుంది. ఈ మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకసారి మూల్యాంకన కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఫలితాల విడుదలకు సంబంధించిన ఇతర దశలను అధికారులు ప్రారంభిస్తారు.
ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, పదో తరగతి ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ త్వరలోనే వెల్లడికానుంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లేదా SMS ద్వారా తెలుసుకోవచ్చు.