AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Andhra Pradesh New Ration Card :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు కావలసిన వారు, చిరునామా మార్చాలనుకునేవారు, లేదా కొత్తగా కార్డు అవసరమున్న లబ్దిదారులు మే 7వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఈ కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయి. వీటికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా గడచిన 6 నెలల రేషన్ వివరాలు స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ కార్డుతో రేషన్ పొందే సదుపాయం ఉంటుంది.

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు విధానం : కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు స్థానిక గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ అందుబాటులో ఉన్న అధికారులకు అవసరమైన వివరాలు అందించాలి. ఈకేవైసీ పూర్తయిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు అవసరమైతే, దానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారుల ద్వారా పరిశీలన జరగుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త కార్డు జారీ అవుతుంది.
ఈకేవైసీ ప్రక్రియ వివరాల : ఈకేవైసీ (eKYC) ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 94.4% మందికి పూర్తయింది. ఇది ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియ. అయితే, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 80 సంవత్సరాల పైబడిన వయోజనులకు ఈకేవైసీ చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.24 కోట్ల మందికి పైగా లబ్దిదారులుగా నమోదు అయ్యారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్దిదారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎవరి వద్ద రేషన్ కార్డులు ఉండి అనర్హులైతే, వారు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. కొత్తగా కార్డు కావలసిన వారు తప్పనిసరిగా eKYC పూర్తి చేయాలి. కార్డులో మార్పులు చేయాలనుకునే వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సచివాలయాల వద్ద అధికారులు అవసరమైన సమాచారం తీసుకుని దరఖాస్తులు స్వీకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 7, 2025
*సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ: మే 7 నుండి
*స్మార్ట్ కార్డుల జారీ: జూన్ 2025 నుండి ప్రారంభం
🔥Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి