AP Latest Scheme: రూ.20,000 రైతు భరోసా & తల్లికి వందనం పథకాన్ని గురించి కీలక ప్రకటన
Andhra Pradesh Latest News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయచోటి సభలో ప్రజలకు అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామని, ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు.

రైతుల కోసం రూ.20,000 రూపాయలను రైతు భరోసా పథకం కింద మే నెలలో అందించబడుతుందని ప్రకటించారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అందించబడతాయి. అలాగే, తల్లికి వందనం పథకాన్ని విస్తరించి, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ ప్రయోజనాలు అందించబడతాయని ప్రకటించారు. అందులో స్కూల్ అటెండెన్స్ ఆధారపడి ఉంటుంది. అందుకే తప్పనిసరిగా పిల్లలని స్కూలుకి పంపియండి.
ఈ ప్రకటనల ద్వారా ప్రభుత్వం పేదలు, రైతులు మరియు మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది
