తల్లికి వందనం – అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల.. రేపు రాని వారు అలా చెయ్యండి | Thalliki Vandanam Scheme 2026 eligible and ineligible List
Thalliki Vandanam Scheme 2026 eligible and ineligible List : తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేయడానికి అర్హుల మరియు అనర్హుల జాబితా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేశారు.. వెంటనే తెలుసుకోండి.. రాని వారు ఏం చేయాలి అనేది చాలామందికి సందేశాలు ఉన్నాయి.. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు పడే 22 జులై 2026 అలాగే తల్లికి వందనం అర్హుల & అనర్హుల లిస్ట్ ప్రదర్శన SGSW ఆఫీసుల రేపు మార్నింగ్ నోటీస్ పోర్ట్ లో ప్రచురిస్తారు. తల్లికి వందనం రానివారు ఆన్లైన్ ఫిర్యాదులు / రీ-అప్లై గడువు 22 జులై 2026 నుండి 03 ఆగష్టు 2026 లోపు చేసుకోవాలి. అర్హులైన నిరుపేదల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13 వేల చొప్పున జమ చేయబోతున్నారని ప్రభుత్వం తెలిపారు. అలాగే 2000 చదివే స్కూల్ ఖాతాకి వెళుతుంది. తల్లులు తమ అకౌంట్లో బుధవారం డబ్బులు వచ్చాయా లేదో ముందుగా తెలుసుకోండి. తల్లికి వందనం రిలీజ్ అయిన ఒకటిన్నర గంటలో మనీ తమకు జమవుతుంది. ఎవరికైనా మని రాకపోతే రోజంతా వెయిట్ చేయాలి ఆ తరువాత గురువారం కూడా ఎదురు చూసి అప్పటికి రాకపోతే శుక్రవారం కంప్లైంట్ ఇవ్వవచ్చు.

తల్లికి వందనం డబ్బులు రాదేమో అనే టెన్షన్ అక్కరలేదు. స్కూల్ వెళుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. కొత్తగా అడ్మిషన్ అయిన అభ్యర్థులకు, స్కూళ్లకు మారిన విద్యార్థులు, ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్ కొత్తగా చేరిన విద్యార్థులు జూలై 22న మనీ రాకపోవచ్చు. తల్లికి వందనం రానివారు ఆన్లైన్ ఫిర్యాదులు / రీ-అప్లై గడువు 22 జులై 2026 నుండి 03 ఆగష్టు 2026 లోపు చేసుకోవాలి. చాలామందికి జూలై 22న మనీ వచ్చేసే విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేశారు. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు ఇచ్చేది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తుంది.
జూలై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించి దాదాపుగా 41 లక్షల మంది తల్లుల ఖాతాలలో మనీ జమ కానున్నది. ఐటిఐ, పాలిటెక్నికల్, RGUKT (IIIT) వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం రాదు. వారికి ఫీజు రిమెంబర్ మెంట్ ఉంటే, రాదు. ప్రభుత్వ ఉద్యోగులకు మనీ రాదు, ఈ సంవత్సరం పారిశుద్ధ్య కార్మికులకు, మినీ అంగన్వాడీ టీచర్లకు & ఆయా ఉద్యోగులకు తల్లికి వందనం వస్తుంది.
తల్లికి వందనం అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ఏం చేయాలి.
తల్లులు టెన్షన్ పడనవసరం లేదు, ముందుగా బ్యాంకుకు వెళ్లి ఆధార్ కార్డుతో బ్యాంకు లింకు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేయాలి. అలాగే NPCI మ్యాపింగ్ లేకపోయినా మనీ రాదు. GSWS సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ సమస్య ఉంటే కూడా మనీ రాదు. మీరు తెల్లవారి జామున సచివాలయంలో అర్హుల మరియు అనర్హుల జాబితా నోటీస్ పోర్ట్ లో ప్రదర్శిస్తారు. అందులో మీ పేరు వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి.

Thalliki Vandanam Final Eligible 2026 – 2027 : గ్రామ వార్డు సచివాలయాలలో ఈ క్రింది వివరాలు ఉంటాయి. అందులో Mother / Guardian Name, Mother/Guardian Aadhar number, Student ID, Student Name, Student Aadhaar number, School Code/School, Class, Final Amount & NPCI Status – ACTIVE అందులో మీ పేరు ఉంటే అందులో డైరెక్ట్గా మీకు అమౌంట్ వస్తుంది.

