Aadhar Card : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
Aadhar Card special camp in Andhra Pradesh Update : ఆంధ్రప్రదేశ్ లో ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఈ నెల 5 నుంచి 8, 12వ తేదీ నుంచి 15 వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు ఆధార్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్ తీసుకొని ఉంటే సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
ఇందులో పిల్లల ఆధార్ కొత్త ఆధార్ చేసుకోవడానికి ఉచితం. 5-7, 15-17 సంవత్సరంలో మధ్య వయసు ఉండినటువంటి తప్పు సరి చేసే దానికి ఉచితం. మిగిలిన అందరూ కూడా 50 నుంచి 100 రూపాయలు వరకు చార్జెస్ ఉంటాయి.

🔥గుడ్ న్యూస్… ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ నియామకం.. నెలకు రూ.56,100 జీతం
🔥AP ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 79 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల