Good News : విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ప్రకటన రేపు సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఏప్రిల్ 1) ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించడం విద్యార్థులు ఊరట కలిగించే విషయంగా మారింది.

ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగ జరుపుకోనున్నారు. అందువల్ల ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే, వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక ప్రకారం ఏప్రిల్ 1న కూడా ఐచ్ఛిక సెలవుగా ప్రకటించనున్నారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, ఏప్రిల్ 1న ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు)గా ప్రకటించారు. అంటే, ఈ సెలవు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ఐచ్ఛికం. ఇది ముఖ్యంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ అనంతరం విశ్రాంతి కోసం అనుమతించబడిన సెలవుగా చెప్పుకోవచ్చు.
ఈ రెండు రోజుల సెలవుల నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులకు మరింత విశ్రాంతి దొరకనుంది. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఇది ఓ శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఐచ్ఛిక సెలవును అనుసరించాలా? లేదా? అనే విషయాన్ని సంబంధిత సంస్థలు, కార్యాలయాలు నిర్ణయించుకోవచ్చు.

ఈ సెలవు ప్రకటించడంపై ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పర్వదినం అనంతరం ఒక రోజు అదనపు సెలవు ఉండటం ద్వారా కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు అవకాశం లభించనుందని వారు భావిస్తున్నారు.