తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక | రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉగాది… శుభవార్త
Ration Card : రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు శుభవార్త పండగ ముందే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం రేషన్ కార్డు లబ్ధిదారులకు గొప్ప సహాయంగా మారనుంది. ముఖ్యంగా పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈ పథకానికి ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా నిరుపేదలు కూడా సన్న బియ్యం తేనే అవకాశమైతే రావడం జరిగింది.

Ugadi gift for the people of Telangana | Government Ugadi gift for everyone with ration card… Good news
సన్నబియ్యం పంపిణీ పథకం గురించి పూర్తివివరాలు
• ప్రారంభ తేది: ఏప్రిల్ 1, 2025
• పంపిణీ ప్రాంతం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా
• లబ్ధిదారులు: అన్ని రేషన్ కార్డు దారులు
• ప్రతి లబ్ధిదారికి: 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం
• ప్రారంభ స్థలం: హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా
• దొడ్డుబియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం
పౌర సరఫరాల శాఖ ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 89.95 లక్షల రేషన్ కార్డుదారులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. 84% రాష్ట్ర జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం బియ్యం సరఫరా కోసం ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచనుంది.
సన్నబియ్యం పంపిణీ ప్రాముఖ్యత పేదలకు పోషకాహారం అందించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దొడ్డుబియ్యం నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణల కారణంగా దీనిని తొలగించి, సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రజలు తినలేని దొడ్డుబియ్యం బ్లాక్ మార్కెట్కు వెళ్లే పరిస్థితి ఉండేది. ఈ సమస్య నివారణకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఇంకెక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆహార భద్రత పథకాన్ని ప్రారంభిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన. సీఎం మార్చి 30న హుజూర్ నగర్ కు వస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమం తో పాటు, ఇతర సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రజలకున్న ప్రయోజనాలు రేషన్ ద్వారా నాణ్యమైన బియ్యం అందడం, పేదలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించడం, బ్లాక్ మార్కెట్ దోపిడీకి అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ హామీలను అమలుచేయడం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు కలిగించనుంది. ఇది కేవలం ఉచిత రేషన్ మాత్రమే కాకుండా, పోషకాహార భద్రతను మెరుగుపరిచే కార్యక్రమంగా మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు మరింత సంక్షేమం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.