తల్లికి వందనం 15000 కొత్త రూల్స్ వచ్చేసాయి | Talliki Vandanam Scheme 2025 NPCI Link Latest News
Talliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం 2025కు సంబంధించి కొన్ని కీలక మార్పులు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు నేరుగా నగదు బదిలీ చేయడం జరుగుతుంది. అయితే, ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఆ ఖాతా ఆధార్ కార్డుతో NPCI ద్వారా లింక్ అయి ఉండాలి. NPCI లింక్ లేనివారికి తల్లికి వందనం అమౌంట్ పడదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా NPCI లింక్ లేని తల్లుల జాబితాను విడిగా విడుదల చేసింది. ఆ వివరాలు మరియు తదనుగుణంగా ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

NPCI లింక్ లేనివారికి ప్రత్యేక జాబితా విడుదల : ఇప్పటికే ప్రభుత్వం రెండు విభిన్న లిస్టులను విడుదల చేసింది:
• School Children Mothers Inactive NPCI List
• General Inactive NPCI List
ఈ జాబితాలను గ్రామ/వార్డు సచివాలయ అధికారులే తమ లాగిన్ ద్వారా చూడగలరు. గ్రామ సచివాలయ పరిధిలో అయితే డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్ చేయవలసి ఉంటుంది. వార్డు పరిధిలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్ ద్వారా లిస్టును చూడవచ్చు.
మీ పేరు లిస్టులో ఉందా? వెంటనే తీసుకోవాల్సిన చర్యలు : మీ పేరు పై లిస్టుల్లో ఉంటే మీరు వెంటనే క్రింద పేర్కొన్న ప్రక్రియను అనుసరించాలి:
1. బ్యాంకులో ఆధార్ లింక్ చేయించాలి
మీరు ఇప్పటికే బ్యాంక్ ఖాతా కలిగి ఉంటే, సంబంధిత బ్రాంచ్ను సందర్శించి ఆధార్ కార్డుతో NPCI లింక్ చేయించుకోవాలి. కొన్ని రోజుల్లో లింక్ పూర్తవుతుంది.
2. బ్యాంక్ ద్వారా లింక్ కాకపోతే – పోస్ట్ ఆఫీస్కి వెళ్లండి పోస్ట్ ఆఫీస్లో కొత్త సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి, NPCI Consent ఇవ్వండి. 10 రోజుల్లోగా లింక్ అయి నగదు బదిలీకి అర్హత పొందవచ్చు.
3. ఖాతా లేనివారు – కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి బ్యాంక్ ఖాతా లేనివారు ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఖాతా ఓపెన్ చేసి ఆధార్ సమ్మతి ఇవ్వాలి. దీని ద్వారా NPCI లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఆన్లైన్ ద్వారా NPCI లింక్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా? మీరు ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతా NPCI లింక్ అయిందా లేదో తెలుసుకోవచ్చు.
NPCI తద్వారా లింక్ స్టేటస్ చెక్ చేయాలంటే:
• NPCI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
• “Consumer” ఎంపికపై క్లిక్ చేయండి
• “Bharat Aadhaar Seeding Enabler (BASE)” ను సెలెక్ట్ చేయండి
• అక్కడ మీ ఆధార్ నంబర్ మరియు బ్యాంక్ పేరు నమోదు చేసి సెర్చ్ చేయండి
• మీ NPCI లింకింగ్ స్టేటస్ కనిపిస్తుంది
“తల్లికి వందనం” పథకం ద్వారా నగదు పొందాలంటే ఖచ్చితంగా NPCI లింక్ అవసరం. లిస్టులో పేరు ఉందని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే లింక్ చేయించుకోవాలి. అవసరమైతే సమీప సచివాలయం లేదా బ్యాంకును సంప్రదించాలి. NPCI లింక్ లేనివారి పేర్లను అధికారులు సేకరిస్తున్నారు.

ఈ పథకం లక్ష్యమైన విద్యార్థుల తల్లులందరికీ ప్రభుత్వం సహాయం అందించాలన్న ఆలోచన ఉంది. కానీ, వ్యవస్థలో పారదర్శకత కోసం NPCI లింక్ తప్పనిసరి అయింది. మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అందాలంటే, ఆలస్యం చేయకుండా మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో NPCI ద్వారా లింక్ చేయించుకోవాలి.