AP Government : కిలో ఉల్లి రూ.32కే.. వచ్చే వారం నుంచి పంపిణీ నాదెండ్ల కీలక ప్రకటన
AP Farmers Markets Onion to be distributed from next week at Rs 32 per kilo in AP : ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు శుభవార్త వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లో కిలో ఉల్లిపాయ 32 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ధరలకే ఉల్లిపాయ 32 రూపాయలకే కిలో ధర అందిస్తామని వెల్లడించారు. మొబైల్ కౌంటర్ ద్వారా కూడా సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే నాలుగు లేదా ఐదు నెలల రేషన్ తో పాటు కిలో కందిపప్పు మార్కెట్ ధర కంటే 25-30% కంటే తక్కువ ధరకే అందిస్తామని ఢిల్లీలో ప్రకటించారు. షుగర్, పచ్చిశనగలను యధావిధిగా సరపరా చేస్తామని తెలిపారు. అలాగే పామాయిల్ ధరలు నియంత్రణలో నియంత్రణకు కేంద్రం చర్చించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలో కిలో ఉల్లిపాయ 35 రూపాయలు సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. అలాగే మార్కెట్ ధర కంటే పది రూపాయలు లీటర్ పామాయిల్ తగ్గిస్తామని తెలిపారు. కందిపప్పు పై త్వరలోనే నిర్ణయం తీసుకొని చెప్తామని తెలిపారు. ఇప్పటికే తక్కువ దొరికే బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు అవసరం లేకుండా ఆధార్ కార్డు ఉంటే తక్కువ ధరికే బియ్యం అందించే విధంగా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 132 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆధార్ చూపిస్తే కేజీకి ₹10 చొప్పున బీపీటీ రకం బియ్యాన్ని కిలోకి 50 రూపాయల నుంచి 52 రూపాయలు ఇస్తామని తెలిపారు.


