ఏపీ కొత్త పెన్షన్ల… ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభం.. గడువు పెంచుతారా? | AP NTR Bharosa pension 2026 field verification form released & Last Date
AP NTR Bharosa pension 2026 field verification form released & Last Date : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుని ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5,01,241 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు ఇంకా మూడు రోజులు మాత్రమే టైముంది. అలాగే అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. పూర్తిగా వివరాలు వెళ్లినట్లయితే..

ఏపీలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబరు 16 వరకు మాత్రమే ఉంది. ఈ గడువు పెంచుతారా.. వేచి చూడాలి. ఎందుకంటే ఎల్లుండి రెండో శనివారం సెప్టెంబర్ 12న, ఆదివారం సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇంతటితో రేపు కలిపి దరఖాస్తు కి 3 రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే 5,01,241 అప్లికేషన్ వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. అనంతపురం జిల్లాలలో అత్యధికంగా 25,019 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు పీల్ వెరిఫికేషన్ ఫామ్ కూడా జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి ఫీల్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఇందులో సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అధికారులు విలేజ్ కి వెళ్లేసి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నెలసరి జీతం, భూమి విస్తరణ, ఉద్యోగ వివరాలు & ఇప్పుడే ఇప్పటికే పొందుతున్న పెన్షన్ క్రాస్ చెక్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులకు నెలసరి ఆదాయం 10,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12 వేల లోపు ఉండాలి. తడిభూమి మూడు ఎకరాలు లోపు ఉండాలి. పొడి భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాలలో ఫ్లాట్లు 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి. అలాగే ఇన్కమ్ టాక్స్, ఫోర్ వీలర్ వెహికల్ వంటివి కూడా పరిశీలిస్తున్నారు. ఆరు నెలల విద్యుత్ బిల్లులను పరిశీలిస్తున్నారు. అప్లై చేసుకుంటానే పని అయిపోలేదు.. ఫీల్డ్ వెరిఫికేషన్ లో వాళ్లు అర్హుల, అనర్హుల అనేది నిర్ధారించడం జరుగుతుంది. అడిగినటువంటి డాక్యుమెంట్స్ అని చూపించి వచ్చినటువంటి అధికారులకు సహకరించాలని ప్రభుత్వం తెలిపారు.


