ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా | Telangana Intermediate Results 2025 | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
Telangana Intermediate Results 2025 : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు 20న కంప్లీట్ అయ్యాయి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ పరీక్షలు మార్చి 20 పూర్తి అయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 22, 2025 నుండి ప్రారంభమైంది. మొత్తం 14,000 మంది అధ్యాపకులు పరీక్షా పత్రాలు చెక్ చేయడంలో పాల్గొంటున్నారు. 9,96,971 మంది విద్యార్థులు రాసిన పరీక్షలలోని 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది.
Telangana Intermediate Results 2025 Date

ఇంటర్మీడియట్ పరీక్ష మూల్యాంకనం 19 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో నెలరోజుల పాటు కొనసాగుతుంది. సమాధాన పత్రాలను వివిధ స్థాయిల్లో పరిశీలించి మార్కులు ఖరారు చేస్తారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, ఈసారి బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటరీకరణ పూర్తి చేసి, మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యలతో, విద్యార్థులకు త్వరగా, తప్పులులేని ఫలితాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చదవండి.

🔥AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025