చేయూత పెన్షన్ల దరఖాస్తులు ఈ నెల 31 లోగా చేసుకోవాలి | Cheyutha Scheme 2026
Telangana Cheyutha Scheme 2026 new pension application last date August 31st : తెలంగాణ అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్ కింద మొదటి దశలలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

తెలంగాణలో కొత్త పెన్షన్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు చేయూత పథకం కింద ఆగస్టు 31 వరకు మాత్రమే అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సృష్టించారు. గడువు లోపల దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్ అందుతాయని తెలిపారు. ఎందుకు గాను వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలు సేపరేషన్ నివేదిక MRO నుంచి దొరుకుతుంది, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్, చేనేత కార్మికులు చేనేత సర్టిఫికెట్ అలాగే పైలేరియా బాధితులు హెల్త్ సర్టిఫికెట్ తీసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలుపుతున్నారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయము లో అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని ఈనెల 31 లోగా సమర్పించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాలలో సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హుల ప్రతి ఒక్కరికి గుర్తించి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వాటిని అధికారులు పరిశీలించి అవసరమైన వివరాలను చేయూత పోర్టల్ లో ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసేందుకు సర్పంచులు సహకరించాలని తెలిపారు.

🛑Cheyutha Scheme 2026 new pension application required document details click here

