ఏపీ డ్వాక్రా మహిళలకు నెలకు 30 వేల నుంచి ₹1లక్ష వరకు ఆదాయం | AP Government Helps DWCRA Women To Establish Own Business
AP Government Helps DWCRA Women To Establish Own Business : ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశంతో 35% రాయితీతో PMEGP పథకం ద్వారా లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళా అభ్యర్థులకు అరకు కాఫీ, చాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ నుంచి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా డ్వాక్రా మహిళలకు నెలకు 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం ద్వారా అనుసంధానం చేయడంతో సుమారుగా 35% వరకు రాయితీ లభిస్తుంది ఆసక్తికరమైన మహిళా అభ్యర్థులు తమ జిల్లాలోని వెలుగు ఆఫీస్ కి వెళ్లేసి సంప్రదించాలని అధికారులు సూచించారు.
అరకు కాఫీ కాఫీ స్టాల్స్ కోసం 3.90 లక్షల నుంచి 5.9 లక్షలు వరకు వ్యయం అవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాలు విజయవంతంగా స్థాపించారు. గాటోస్ కేఫ్ స్టాల్స్ కోసం రూ.5 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది. చాయ్ రాస్తా వివిధ రకాల టీ వెరైటీ ల కోసం నాలుగు రకాల వినేత మోడల్ ను ప్రవేశపెట్టారు దీనికి కావలసిన పెట్టుబడి ఖర్చు రూ.3.9 లక్షల నుంచి రూ.6.7 లక్షల వరకు ఉంటుంది. మహిళల చేత నుంచి సొంతంగా భారీ పెట్టబడును ఖర్చు లేకుండా బ్యాంకు లోను ఫైనాన్స్ అసిస్టెంట్ ద్వారా జిల్లా సమాఖ్య, సర్ఫ్ అధికార సహకార బ్యాంకు రుణాలు మంజూరు చేస్తాయి. ఈ వ్యాపార యూనిట్లు కోసం కేంద్ర ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా సబ్సిడీతో కూడా యూనిట్లు అందిస్తున్నారు. పూర్తి ఖర్చులు 35 శాతం సబ్సిడీ లభిస్తుంది.

డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చార్జెస్ లేకుండా రుణాల అందించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ బిజినెస్ ద్వారా విజయవంతంగా నడిపినట్లయితే రోజు వారికి ఖర్చు ముడి సరుకులకు పోను నెలకు 30,000 నుంచి లక్ష రూపాయలు వరకు నికరంగా ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడి 5 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు.

