Samagra Shiksha Abhiyan Job Recruitment in Telugu
➡️కేజీబీవీల్లో 958 కాంట్రాక్టు పోస్టుల భర్తీ » కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా ల్లో ( కేజీబీవీ ) ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, సీఆర్డీలు, పీఈటీలు, ఒకేషనల్ ఉపాధ్యా యుల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు.
>జిల్లాల్లో జేసీలు, డీఈవోలు, సమగ్రశిక్ష ఏపీ డీలు ఈ నెల 20 లోపు పోస్టులను భర్తీ చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 958 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమ్యూనిటీ ఎయిడ్ అండ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం (సీఎఎస్పీ) కింద వచ్చే నిధుల నుంచి ఈ సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు.
>ఏడాది పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎంపికచేసే వీరికి ప్రత్యేకంగా నియామకపత్రం ఇవ్వరు. ఏ కేజీబీవీ పాఠశాలకు రిపోర్టు చేయాలో మాత్రమే చెబుతారు. ఎంపికైన కాంట్రాక్టు ఉద్యోగులు భవిష్యత్తులో తమ పోస్టులు క్రమబద్ధీకరించా లని కోరేందుకు వీల్లేదని, ఏడాది మధ్యలో ఎప్పుడైనా వారిని విధుల నుంచి తొలగిం చవచ్చని వెట్రిసెల్వి గురువారం విడుదల చేసిన మెమోలో పేర్కొన్నారు.
>కాంట్రాక్టు ఉపాధ్యాయుల భర్తీకి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా ఓ కమిటీని నియమించారు.
➡️కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొడవలూరు : అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో గ్రామ కోఆర్డినేటర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నామని మండల కోఆర్డినేటర్ హర్విలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు.
>పది, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులన్నారు. వివరాలకు 8074600851 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links: