తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
AP Thallikki Vandanam Scheme 2025 :
ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ కి వెళుతున్నటువంటి పిల్లలకు తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లి వందన పథకం (Thallikki Vandanam Scheme 2025) జూన్ 12వ తేదీ నాడు అంటే స్కూల్ రీఓపెన్ రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఎంతమంది స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా 15000 రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ అమౌంట్ మీకు రావాలనుకుంటే అర్హత మరియు అప్లికేషన్ కావాల్సింది సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తల్లికి వందనం సంబంధించి ఒకటో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలియచేయడం జరిగింది.
తల్లికి వందనం పథకం కావలసిన అర్హతలు
*తల్లికి వందనం పథకం రావాలంటే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర నివాసులై ఉండాలి.
* ప్రభుత్వం గుర్తించినటువంటి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి అలాగే కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
*తల్లి పేరు మీద బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో లింక్ ఉండాలి.
* తల్లివందనం పడాలి అంటే ఆర్థిక వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితి లోబడి ఉండాలి.
తల్లివందనం రావాలంటే ఉండవలసిన సర్టిఫికెట్ వివరాలు
*విద్యార్థి స్టడీ సర్టిఫికెట్
*తల్లి ఆధార్ కార్డు
*తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్
*రేషన్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం
* అవసరమైతే కుల దృవీకరణ పత్రం
* ఆదాయ సర్టిఫికెట్
* పిల్లలు స్కూల్ హాజరు సర్టిఫికేట్
తల్లివందన అప్లికేషన్ ఎలా చేసుకోవాలి
* అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా https://gramawardsachivalayam.ap.gov.in/ ఓపెన్ చేసి
* తల్లికి వందనం పథకం పై ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత ఆధార్ కార్డు వివరాలు విచ్ లాగిన్ చేయండి.
* ఫాం పూర్తిగా ఫిల్ అప్ చేసి.. కావలసినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే చాలు.

మరిన్ని వివరాలు ప్రభుత్వం త్వరలోనే జాబితా విడుదల చేయడం జరుగుతుంది తల్లి యొక్క అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇంకా ఏదైనా వివరాలు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేయండి.