Thalli Ki Vandanam : తల్లికి వందనం పథకం అమలుకు  మార్గదర్శకాల విడుదల

Thalli Ki Vandanam : తల్లికి వందనం పథకం అమలుకు  మార్గదర్శకాల విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Thalli Ki Vandanam Latest Scheme Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేగంగా కదులుతోంది. ముఖ్యంగా “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి పూర్తి సన్నద్ధతలో ఉంది. ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ. 9407 కోట్ల భారీ నిధులను కేటాయించారు. ఇప్పుడు నిబంధనలు, అమలుకై మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

తల్లికి వందనం పథకం తాజాగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ప్రకారం, పిల్లల సంఖ్యను అనుసరించి తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.15,000 చొప్పున జమ చేయనున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలా? లేక రెండు విడతలుగా రూ.7500 చొప్పున చెల్లించాలా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. తుది నిర్ణయం త్వరలో వెల్లడించనున్నారు.

తల్లికి వందనం లబ్ధిదారుల ఎంపిక – కీలక ప్రమాణాలు

2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో సుమారు 81 లక్షల విద్యార్థులు ఉన్నారు. అయితే, విద్యాశాఖ అందించిన సమాచారం ప్రకారం, 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం అర్హులుగా గుర్తించబడ్డారు.
ఈ పథకం పొందడానికి 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. విద్యార్థులు తరచూ పాఠశాలకు హాజరుకావడం అనివార్యం.

తల్లికి వందనం పథకంపాత నిబంధనలపై మళ్లీ సమీక్ష గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను సమీక్షిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించనుంది.

గత నిబంధనల ప్రకారం:

*ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కాదు.

*తెల్ల రేషన్ కార్డు లేనివారు అర్హులు కాదు.

*300 యూనిట్లకు మించి విద్యుత్ *వినియోగించే కుటుంబాలకు అర్హత లేదు.

*కార్ కలిగి ఉన్న కుటుంబాలకు అర్హత లేదు.

*నగరాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలమైన ఇళ్లయిన వారు అర్హులు కాదు.

ప్రస్తుతం ఈ నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలా లేదా కొనసాగించాలా అన్నదానిపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని కసరత్తు జరుగుతోంది. మార్గదర్శకాలు ఖరారు చేసిన వెంటనే, నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతుంది.

🔥Govt Jobs : ప్రభుత్వ మ్యూజియంలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥TS SSC Results 2025 : TS 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. తేదీ ఫైనల్ చేశారు

🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెల జీతం 36,220 ఇస్తారు

🔥Airport లో తెలుగు భాష వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *